రేషన్ షాపుల్లో తనిఖీలు
ABN , First Publish Date - 2020-11-13T05:53:35+05:30 IST
మండలంలోని పలు రేషన్ షాపులను విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగర, పడమరఖండ్రికల్లో 13, 14, 15, 17, 38 రేషన్ షాపుల్లో రికార్డులు, స్టాకు నిల్వలను తనిఖీ చేసి 17వ నెంబరు షాపులో సరుకు నిల్వల్లో వ్యత్యాసాన్ని గుర్తించారు.
కపిలేశ్వరపురం, నవంబరు 12: మండలంలోని పలు రేషన్ షాపులను విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగర, పడమరఖండ్రికల్లో 13, 14, 15, 17, 38 రేషన్ షాపుల్లో రికార్డులు, స్టాకు నిల్వలను తనిఖీ చేసి 17వ నెంబరు షాపులో సరుకు నిల్వల్లో వ్యత్యాసాన్ని గుర్తించారు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ సీఐలు సత్యకిషోర్, శ్రీనివాసరెడ్డి, తహశీల్దారు విజయ్కుమార్ మాట్లాడుతూ పడమరఖండ్రిక షాపు నెం.17లో 464 కిలోల బియ్యం, 4 కిలోల పంచదార, 90 కిలోల శనగలు, 40 కిలోల కందిపప్పు వ్యత్యాసాన్ని గుర్తించామన్నారు. దీనిపై 6(ఎ) కేసు నమోదు చేసి జేసీ కోర్టులో నివేదిస్తామని తెలిపారు. తనిఖీల్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ షేక్ వల్లీ, ఎంఎస్వో సీహెచ్ వరప్రసాద్, కానిస్టేబుల్ ఈశ్వర్, వీఆర్వోలు వెంకటేశ్వరరావు, డీవీ రాఘవులు, పాల్గొన్నారు.