ఉప్పాడలో అరుదైన చేపలు లభ్యం
ABN , First Publish Date - 2020-10-08T06:14:57+05:30 IST
ఉప్పాడ తీరంలో బుధవారం ఓ మత్స్యకారుడి వలకు అరుదైన 4 గుండుపార చేపలు చిక్కాయి...

ఉప్పాడ(కొత్తపల్లి): ఉప్పాడ తీరంలో బుధవారం ఓ మత్స్యకారుడి వలకు అరుదైన 4 గుండుపార చేపలు చిక్కాయి. వీటిని స్థానిక టోకు చేపల వర్తకుడు రూ.20 వేలకు కొనుగోలు చేశాడు. సముద్రం అడుగుభాగంలో సంచరించే ఈ చేపలు అరుదుగా వలలకు చిక్కుతాయని మత్స్యకారులు చెప్తున్నారు.