కేసుల భయంతో పోలవరాన్ని తాకట్టు పెడుతున్న సీఎం
ABN , First Publish Date - 2020-11-03T05:35:59+05:30 IST
సీఎం జగన తనపై ఉన్న కేసుల భయంతో పోలవరాన్ని తాకట్టు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
- మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
అనపర్తి, నవంబరు 2: సీఎం జగన తనపై ఉన్న కేసుల భయంతో పోలవరాన్ని తాకట్టు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని రామవరంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఆరున్నర దశాబ్ధాలుగా కాగితాలకే పరిమితమైన పోలవరం ప్రాజెక్ట్కు రూపు తీసుకువచ్చిన ఘనత మాజీ సీఎం చంద్రబాబుదేనన్నారు. 2005లో కేంద్రం ఆమోదించిన పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని 2014 వరకు ప్రభుత్వాలు సగం నిధులు కూడా వినియోగించలేదన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 80శాతం పనులను పూర్తి చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తిచేయడం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన సీఎం కేసుల భయంతో పోలవరాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.