రాజమండ్రిలో ఎడతెరపిలేని వర్షం
ABN , First Publish Date - 2020-11-27T14:59:55+05:30 IST
నివర్ తుపాన్ ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జిల్లాలో ఈదురు గాలులతో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది
రాజమండ్రి: నివర్ తుపాన్ ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈదురు గాలులతో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. బలమైన చలిగాలులతో జనం వణికిపోతున్నారు. భారీ వర్షాలతో వేల ఎకరాల్లో వరి పంట నేలకు వాలి తడిసిపోయింది. అటు అరటితోటలు కూడా నేలకొరిగాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు