గోదావరి ఘాట్ల వద్ద పుణ్యస్నానాలకై కోవిడ్ ఆంక్షలు
ABN , First Publish Date - 2020-11-15T19:02:00+05:30 IST
రేపటి నుంచి కార్తీకమాసం ప్రారంభంకానున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనల ప్రకారం నదీస్నానాలు, ఆలయాల్లో పూజలకు ఏర్పాట్లు చేశారు.

రాజమండ్రి: రేపటి నుంచి కార్తీకమాసం ప్రారంభంకానున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనల ప్రకారం నదీస్నానాలు, ఆలయాల్లో పూజలకు ఏర్పాట్లు చేశారు. రాజమండ్రిలోని గోదావరి ఘాట్ల వద్ద పుణ్యస్నానాలపై అధికారులు కోవిడ్ ఆంక్షలు విధించారు. 12 ఏళ్లలోపు చిన్నారులు, 60ఏళ్ల దాటిన వృద్ధులను గోదావరి పుణ్యస్నాలకు రావొద్దని రాజమండ్రి కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. గోదావరి స్నానాలకు వచ్చే భక్తులు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని నిబంధన విధించారు.