నిర్దిష్టకాలంలో పౌరసేవలు అందించాలి: జడ్పీ సీఈవో
ABN , First Publish Date - 2020-11-03T06:19:11+05:30 IST
ప్రజలకు మెరుగైన పారదర్శక పాలన అందించేందుకు ప్రభుత్వం గ్రామ సచివాలయాల వ్యవస్థను ప్రవేశపెట్టిందని, ప్రజల నుంచి స్వీకరించిన వినతులను నిర్దిష్టమైన కాలంలో పరిష్కరించాలని జడ్పీ సీఈవో ఎన్వీవీ సత్యనారాయణ చెప్పారు.
సర్పవరం జంక్షన్, నవంబరు 2: ప్రజలకు మెరుగైన పారదర్శక పాలన అందించేందుకు ప్రభుత్వం గ్రామ సచివాలయాల వ్యవస్థను ప్రవేశపెట్టిందని, ప్రజల నుంచి స్వీకరించిన వినతులను నిర్దిష్టమైన కాలంలో పరిష్కరించాలని జడ్పీ సీఈవో ఎన్వీవీ సత్యనారాయణ చెప్పారు. కాకినాడ రూరల్ సర్పవరంలో సచివాలయం-4ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు. వివిధ రికార్డులను పరిశీలించారు. అనంతరం సచివాలయ ఆవరణలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు చెందిన వివరాల ప్రదర్శనను పరిశీలించారు. ఎంపీడీవో పి.నారాయణమూర్తి, పంచాయతీ కార్యదర్శి బి.శ్రీనివాస్ పాల్గొన్నారు.