జియో సైన్సెస్లో పురోగతి సాధించాలి
ABN , First Publish Date - 2020-08-01T11:12:00+05:30 IST
మారుతున్న కాలానికి అనుగుణంగా భూవిజ్ఞాన శాస్త్రంలో నూతన ఆవిష్కరణలతో పురోగతిని సాధించాలని ఆదికవి నన్నయ ..
![జియో సైన్సెస్లో పురోగతి సాధించాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
‘నన్నయ’ వీసీ జగన్నాథరావు
దివాన్చెరువు, జూలై 31: మారుతున్న కాలానికి అనుగుణంగా భూవిజ్ఞాన శాస్త్రంలో నూతన ఆవిష్కరణలతో పురోగతిని సాధించాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వీసీ మొక్కా జగన్నాథరావు అన్నారు. అంబేడ్కర్ యూనివ ర్సిటీ జియో సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో ‘రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ జియో సైన్సెస్’పై శుక్రవారం జాతీయ వెబినార్ను నిర్వహించారు. వీసీ జగన్నాథ రావు విశిష్ట అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సముద్ర గర్భంలోని మినరల్ రీసోర్సెస్ను ఉపయోగించుకొనే విధానం, వాటికి అవసరమైన సాంకేతికపర మైన విజ్ఞానాన్ని ఏవిధంగా అభివృద్ధి చేసుకోవాలో వివరించారు. ఎంసీఎస్డీ జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ వీఏ అంబిలి, నేషనల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ రాక్ మినరల్స్ ముఖ్య శాస్త్రవేత్త డీఎస్ సుబ్రహ్మణ్యం, డైరెక్టర్ గ్రేడ్ శాస్త్రవేత్త వీఎస్ శర్మ వివిధ అంశాలపై ప్రసంగించారు.