ప్రణబ్‌ముఖర్జీ మృతి దేశానికి తీరని లోటు

ABN , First Publish Date - 2020-09-03T11:08:07+05:30 IST

మాజీ రాష్ట్ర పతి ప్రణబ్‌ముఖర్జీ అకాల మృతి దేశానికి తీరని లోటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొ న్నారు.

ప్రణబ్‌ముఖర్జీ మృతి దేశానికి తీరని లోటు

అమలాపురం టౌన్‌, సెప్టెంబరు 2: మాజీ రాష్ట్ర పతి ప్రణబ్‌ముఖర్జీ అకాల మృతి దేశానికి తీరని లోటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. అమలాపురంలో బుధవారం ప్రణబ్‌ ముఖర్జీ చిత్రపటానికి ఆయన పూలమాలలువేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే ఎంఏ.వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్‌, వేటుకూరి సూర్యనారాయణరాజు, మాలే శ్రీని వాస్‌నగేష్‌ జంగా రాజేంద్ర, కొల్లి సూర్యారావు పాల్గొన్నారు.  నగరం నియోజకవర్గానికి చెందిన ఉండ్రు రామారావు సహచరులతో కలిసి బీజేపీలో చేరగా వీర్రాజు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.


ప్రణబ్‌ముఖర్జీకి ఘన నివాళి

ఆత్రేయపురం: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మృతిపై మండలపరిషత్‌ కార్యాలయంలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల పరిషత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-09-03T11:08:07+05:30 IST