పోలియో రహిత సమాజానికి కృషి
ABN , First Publish Date - 2020-10-27T06:00:25+05:30 IST
పోలియో రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ పిలుపునిచ్చారు.

- ఎస్పీ నయీం అస్మీ
సర్పవరం జంక్షన్, అక్టోబరు 26: పోలియో రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ పిలుపునిచ్చారు. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ, స్మార్ట్సిటీ, రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్, గ్రీన్ సిటీ, సెంట్రల్ క్లబ్ల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పోలియో అంతం (ఎండ్ పోలియో) సైకిల్, బైక్ ర్యాలీని సర్పవరం జంక్షన్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ నయీం అస్మీ మాట్లాడుతూ పోలియో నివారణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. పోలియో నిర్మూలన కోసం రోటరీ క్లబ్లు, స్వచ్ఛంద సేవా సంస్థల చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ, ట్రాఫిక్ సీఐ మురళీకృష్ణారెడ్డి, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.