పోక్సో చట్టం కింద కేసు నమోదు
ABN , First Publish Date - 2020-12-13T05:56:47+05:30 IST
పట్టణానికి చెందిన బాలికపై 35 సంవత్సరాల వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

మండపేట, డిసెంబరు 12: పట్టణానికి చెందిన బాలికపై 35 సంవత్సరాల వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పదో వార్డుకు చెందిన బాలిక ఈనెల 10న ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా బాలికను ఇంట్లోకి పిలిచి నరేష్ (35) అనే యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక శుక్రవారం తల్లిదండ్రులకు చెప్పడంతో శనివారం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిపై పట్టణ సీఐ నాగమురళీ నేతృత్వంలో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజే్షకుమార్ చెప్పారు.