పీహెచ్డీ ప్రదానం
ABN , First Publish Date - 2020-11-27T07:01:23+05:30 IST
పీహెచ్డీ ప్రదానం
రామచంద్రపురం, నవంబరు 26: రామచంద్రపురం డిగ్రీ కాలేజీలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తున్న పసుపులేటి నాగమణికి పీహెచ్డీ ప్రదానం చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠం, హైదరాబాద్కు ఆచార్య ఎండ్లూరి సుధాకర్ పర్యవేక్షణలో ఆంధ్ర ప్రతిష్ట, పరిశీలన అనే అంశంపై నాగమణి సిద్ధాంత వ్యాసం సమర్పించారు. దీంతో ఆమెకు డాక్టరేట్ ప్రదానం చేశారు. రామచంద్రపురం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పి.సుభాషిణి, వైస్ ప్రిన్సిపాల్ ఓబిలినేని శ్రీనివాసరావు తదితరులు ఆమెను అభినందించారు.