పనిమనిషి ఎంత పిలిచినా రాకపోవడంతో.. ఇంట్లోకి వెళ్తే కనిపించిన సీన్ చూసి..
ABN , First Publish Date - 2020-03-14T20:30:44+05:30 IST
ముమ్మిడివరం సాయినగర్లో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. దుండగుడు గొంతుకోసి హతమార్చి బంగారంతో పరారయ్యాడు. విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన విత్తనాల సత్యనారాయణ, అతడిభార్య
వృద్ధురాలి దారుణ హత్య
గొంతుకోసి హతమార్చిన దుండగుడు.. ఆపై బంగారంతో పరారీ
ముమ్మిడివరం (తూర్పు గోదావరి జిల్లా): ముమ్మిడివరం సాయినగర్లో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. దుండగుడు గొంతుకోసి హతమార్చి బంగారంతో పరారయ్యాడు. విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన విత్తనాల సత్యనారాయణ, అతడిభార్య శ్యామల(65) ముమ్మి డివరం సాయినగర్ రెండో వీధి, సర్కిల్ పోలీస్స్టేషన్ వెనుక ఉన్న వీధిలో ఉంటున్నారు. సత్యనారా యణ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు నేరెళ్లపాలెంలో జరిగిన వివాహ కార్యక్రమానికి వెళ్లారు. శ్యామల ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలో దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి బెడ్రూమ్లో ఉన్న ఆమెపై దాడిచేసి కత్తితో గొంతు కోసి మెడలోని బంగారపు పుస్తెలతాడు, నల్లపూసలు దొంగిలిం చుకుపోయాడు. చేతివేళ్లకు ఉన్న ఉంగరాలు, చెవిదుద్ధులు తీసుకెళ్లలేదు.
ఇంటిలో పనిచేయడానికి వచ్చిన పనిమనిషి ఎంత పిలిచినా లోపలి నుంచి ఎవరూ రాకపోవడంతో తలుపు నెట్టి చూడగా మంచంపై నెత్తుటి మడుగులో శ్యామల పడి ఉంది. విషయాన్ని పక్కన ఉన్నవారికి తెలియజేయడంతో వారు స్థానిక ఆర్ఎంపీ వైద్యుడిని పిలువగా అప్పటికే ఆమె మృతిచెందినట్టు నిర్ధారించాడు. ఈ విషయంపై ముమ్మిడి వరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా సత్యనారాయణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. పెద్దకుమార్తె కముజు పద్మ బెంగుళూరులో ఉండగా, రెండో కుమార్తె శీలం విజయలక్ష్మి ఐ.పోలవరం మండలం తిల్లకుప్పలో ఉంటోంది. కుమారుడు శ్రీనివాస్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో ఉంటు న్నాడు. అమలాపురం డీఎస్పీ మసూమ్బాషా, ముమ్మిడివరం సీఐ బి.రాజశేఖర్, ఎస్ఐ ఎం.పండుదొర సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటనకు దారి తీసిన మృతురాలి భర్త సత్యనారాయణను, చుట్టుపక్కల వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాకినాడ నుంచి వచ్చిన క్లూస్టీం ఆధారాలు సేకరించింది. డాగ్స్క్వాడ్ను రప్పించారు. ముమ్మిడిరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.