విదేశాల నుంచి వచ్చిన యువకులకు నోటీస్లు
ABN , First Publish Date - 2020-03-28T10:19:06+05:30 IST
విదేశాల నుంచి వచ్చిన యువకులకు పోలీస్ లు నోటీస్లు ఇచ్చారు. రౌతులపూడి, శృంగవరం గ్రామంలో ఉంటున్న
రౌతులపూడి, మార్చి 27: విదేశాల నుంచి వచ్చిన యువకులకు పోలీస్ లు నోటీస్లు ఇచ్చారు. రౌతులపూడి, శృంగవరం గ్రామంలో ఉంటున్న ఇద్దరు వ్యక్తుల ఇంటికి వెళ్లి జాగ్రత్తలు చెప్పారు. వారు తరచూ వాడే సెల్ఫోన్లోని యాప్ ఇన్స్టాల్ చేశారు.
హరిహరసదన్ క్వారంటైన్కు 124 మంది
అన్నవరం: రత్నగిరిపై హరిహరసదన్ సత్రంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్కు శుక్రవారం 124 మందిని తీసుకొచ్చారు. వారంతా విద్యార్థులు. హాస్టల్స్ మూసివేయడంతో జిల్లా సరిహద్దుకు చేరిన వారికి ముందుజాగ్రత్త చర్యగా ఈ సెంటర్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
విజయనగరంజిల్లాకు చెందిన 45మంది, విశాఖజిల్లా 16, శ్రీకాకుళం 24, ఒడి సాకు చెందిన 21మంది, తూర్పు, చిత్తూరుకు చెందిన ఇద్దరు, ఒంగోలు, తెలంగాణకు చెందిన ఇద్దరేసి ఉన్నారు. వారిని శుక్రవారం ఉదయం ప్రత్యేక వాహనంలో అన్నవరం తీసుకొచ్చారు. దీంతో పారిశుధ్య కార్మికు లు ఆందోళనకు దిగారు. పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని ఆర్డీవో మల్లిబాబు తెలిపారు.