నెహ్రూ వేదిక వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-12-30T07:28:28+05:30 IST

నగరంలోని బాలాజీచెరువు సెంటర్‌లో కూల్చివేసిన నెహ్రూ వేదిక ప్రదేశాన్ని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పార్టీ శ్రేణులతో కలిసి మంగళవారం పరిశీలించడానికి వెళ్లగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

నెహ్రూ వేదిక వద్ద ఉద్రిక్తత
కొండబాబును అడ్డుకుంటున్న పోలీసులు

కొండబాబు పోలీసుల మధ్య వాగ్వాదం   

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), డిసెంబరు29: నగరంలోని బాలాజీచెరువు సెంటర్‌లో కూల్చివేసిన నెహ్రూ వేదిక ప్రదేశాన్ని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పార్టీ శ్రేణులతో కలిసి మంగళవారం పరిశీలించడానికి వెళ్లగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కాకినాడ డీఎస్‌పీ ఆధ్వర్యంలో పోలీసులు వేదిక ప్రదేశం వద్ద టీడీపీ శ్రేణులను చెల్లాచెదురు చేశారు. దీంతో వనమాడి, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. ప్రజాస్వామ్యం లో నిరసన తెలిపే హక్కు ఉందని మల్లిపూడి వీరు, గదుల సాయిబాబా ప్రశ్నించగా వారిని బలవంతంగా పోలీసులు జీపులో ఎక్కించి వన్‌ టౌన్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ తీరును నిలదీసిన కొండబాబును పోలీసులు అడ్డుకోవ డంతో తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ నగరం లో అధికారుల పాలన జరగడం లేదని, రౌడీలు, గూండాల చేతుల్లో పరిపాలన జరుగుతోందన్నారు. ఏళ్ల చరిత్ర ఉన్న నె హ్రూ వేదికను ఇటీవల ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి అనుచరులు తమ స్వలాభం కోసం రాత్రికి రాత్రి కూల్చి వేసి నెహ్రూ విగ్రహాన్ని కూల్చివేసి వివేకానంద పార్కులో పడవేయడం జరిగిందన్నారు. నెహ్రూ వేదికను పునర్నిర్మాణం జరిగేంత వరకు టీడీపీ పోరాటం చేస్తుందన్నా రు. ఈ కార్యక్రమంలో చింతపల్లి కాశి, జోగా రాజు, పలివెల రవి, వనమాడి ఉమాశంకర్‌, తుమ్మల రమేష్‌, వొమ్మి బాలాజీ, ఎండీ అజ్జు పాల్గొన్నారు.



Updated Date - 2020-12-30T07:28:28+05:30 IST