ఇళ్ల స్థలాల భూములపై హైకోర్టుకు వెళ్లిన నరసాపురం గ్రామస్థులు
ABN , First Publish Date - 2020-06-23T10:46:22+05:30 IST
నరసాపురంలో పేదల ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం కేటాయించిన మూడున్నర ఎకరాలకు సంబంధించి గ్రామానికి చెందిన వేగులమ్మ ఉత్సవ కమిటీ..
కోరుకొండ, జూన్ 22: నరసాపురంలో పేదల ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం కేటాయించిన మూడున్నర ఎకరాలకు సంబంధించి గ్రామానికి చెందిన వేగులమ్మ ఉత్సవ కమిటీ, హైస్కూల్ అభివృద్ధి కమిటీ మరోసారి హైకోర్టును ఆశ్రయించాయి. ఈ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్థులు లాక్డౌన్కు ముందు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు పంచాయతీ అధికారులను ఆదేశించింది. అప్పటి నుంచి నాలుగు నెలలుగా అక్కడ ఏ విధమైన పనులు చేపట్టలేదు. వివాదాస్పద స్థలంలో ఇటీవల అధికారులు రాళ్లు పాతి, రోడ్లు వేయడంతో గ్రామస్థులు మరోసారి హైకోర్టు తలుపు తట్టారు.