-
-
Home » Andhra Pradesh » East Godavari » mathes writer murthy sellect
-
గణిత పాఠ్యపుస్తక రచయితగా మూర్తి ఎంపిక
ABN , First Publish Date - 2020-10-31T06:34:25+05:30 IST
2020-21 విద్యా సంవత్సరానికి ఏడో తరగతి గణితశాస్త్ర పాఠ్య గ్రంథ రచనకు అమలాపురం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు, ప్రముఖ గణితావధాని డాక్టర్ టీఎస్వీఎస్.సూర్యనారాయణమూర్తి ఎంపికయ్యారు.

అమలాపురం టౌన, అక్టోబరు 30: 2020-21 విద్యా సంవత్సరానికి ఏడో తరగతి గణితశాస్త్ర పాఠ్య గ్రంథ రచనకు అమలాపురం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు, ప్రముఖ గణితావధాని డాక్టర్ టీఎస్వీఎస్.సూర్యనారాయణమూర్తి ఎంపికయ్యారు. జాతీయ విద్యా విధానం-2020 అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం నూతన పాఠ్య పుస్తకాలను రూపొందిస్తుందన్నారు. రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణా సంస్థ సంచాలకుడు ప్రతాప్రెడ్డి నుంచి తనకు ఉత్తర్వులు అందాయని శుక్రవారం మూర్తి తెలిపారు.