లేఅవుట్ల మెరక పనుల జాప్యంపై సబ్కలెక్టర్ ఆగ్రహం
ABN , First Publish Date - 2020-12-30T06:02:30+05:30 IST
లోతట్టు ప్రాంతాల్లో ఉన్న లేఅవుట్లలో మెరక పనులు ఎందుకు జాప్యం జరుగుతుందని అధికారులపై సబ్కలెక్టర్ హిమాన్షుకౌశిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పి.గన్నవరం, డిసెంబరు 29: లోతట్టు ప్రాంతాల్లో ఉన్న లేఅవుట్లలో మెరక పనులు ఎందుకు జాప్యం జరుగుతుందని అధికారులపై సబ్కలెక్టర్ హిమాన్షుకౌశిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని బెల్లంపూడి, నాగుల్లంక లేఅవుట్లను ఆయన పరిశీలించి అనంతరం మట్లాడారు. నిర్ణీత సమయంలో మెరక పనులు పూర్తికాకపోతే కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరుకావని ఆయన హెచ్చరించారు. జనవరి 4వ తేదీ నాటికి మెరక పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ బి.మృత్యంజయరావుకు సూచించారు. ఇన్చార్జ్ ఎంపీడీవో కె.వెంకటేశ్వరరావు, ఏపీవో మోహన్, ఆర్ఐలు జి.సుబ్రహ్మణ్యం, సీహెచ్ వంశీ పాల్గొన్నారు.