భూసేకరణ వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2020-03-13T09:13:23+05:30 IST
పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు అవసరమైన భూమి సేకరించే ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర భూపరిపాలన కమిషనర్
రామచంద్రపురం, మార్చి 12:
పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు అవసరమైన భూమి సేకరించే ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర భూపరిపాలన కమిషనర్ నీరబ్కుమార్ అన్నారు. రామచంద్రపురం ఆర్డీవో కార్యాలయంలో జేసీ లక్ష్మీశ, ఆర్డీవో గణేష్కుమార్, రామచంద్రపురం, కె.గంగవరం, కాజులూరు, రాయవరం తహశీల్దార్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. అవసరమైన భూమిని వెంటనే సేకరించాలన్నారు. ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటే గుర్తించాలని సూచించారు.