సమస్యలపై అలుపెరగని పోరాటం చేయాలి

ABN , First Publish Date - 2020-12-15T05:38:07+05:30 IST

కరప, డిసెంబరు 14: టీడీపీ కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలపై అలుపెరగని పోరాటం చేయాలని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి

సమస్యలపై అలుపెరగని పోరాటం చేయాలి
కరపలో కార్యకర్తల ఆశీర్వాదంతీసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే పిల్లి దంపతులు

మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి

కరప, డిసెంబరు 14: టీడీపీ కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలపై అలుపెరగని పోరాటం చేయాలని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్తిబాబు సూచించారు. ‘మీ ఆడపడుచుగా మీ ఇంటికి’ కార్యక్రమంలో భాగం గా సోమవారం వారు కరపలో పర్యటించి పలువురు కార్యకర్తలను కలిశారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ఆశీర్వచనాలు తీసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు దేవు వెంకటేశ్వరరావు, నాయకులు రెడ్డిపల్లి అబ్బాయికాపు, మద్దూరి స్వామి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-15T05:38:07+05:30 IST