కొవిడ్‌ బాధితులకు కిట్లు సకాలంలో అందించాలి

ABN , First Publish Date - 2020-08-01T11:11:34+05:30 IST

కొవిడ్‌ బాధితులకు సకాలంలో కిట్లు అందజేయాలని నగరపాలక కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ వైద్యాధికారులను ఆదే ..

కొవిడ్‌ బాధితులకు కిట్లు సకాలంలో అందించాలి

కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌.. వైద్యాధికారులతో సమీక్ష


రాజమహేంద్రవరం సిటీ, జూలై 31: కొవిడ్‌ బాధితులకు సకాలంలో కిట్లు అందజేయాలని నగరపాలక కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ వైద్యాధికారులను ఆదే శించారు. శుక్రవారం సాయంత్రం కార్పొరేషన్‌ కార్యాలయంలో కొవిడ్‌ నియం త్రణా చర్యలపై ఆయన వైద్యాధికారులతో సమీక్షించారు. నగర పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు ఒక్కో దానికి ఒక్కో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. ఆయా కంట్రోల్‌రూమ్‌లు కార్పొరేషన్‌లో ఉన్న కంట్రోల్‌రూమ్‌తో అనుసంధానమై ఉంటాయని, పాజిటివ్‌ కేసుల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుని తీసుకోవాల్సిన చర్యలపై వెంటనే స్పందిస్తామని తెలిపారు. అందిన సమాచారం, ఫిర్యాదుల ద్వారా వెంటనే బాధితులను చేర్పించడం, కిట్లను, మందులను అందజేయడం వేగవంతంగా జరగాలని సూచించారు. 

Updated Date - 2020-08-01T11:11:34+05:30 IST