పామర్రులో ఇద్దరి కిడ్నాప్
ABN , First Publish Date - 2020-12-05T06:33:11+05:30 IST
కె.గంగవరం, డిసెంబరు 4: పామర్రు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు శుక్రవారం ఉదయం కిడ్నా్పకు గురయ్యారు. హెచ్సీ కె.శ్రీనివాసు వివరాల ప్రకారం
కె.గంగవరం, డిసెంబరు 4: పామర్రు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు శుక్రవారం ఉదయం కిడ్నా్పకు గురయ్యారు. హెచ్సీ కె.శ్రీనివాసు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నల్లల దొరబాబు(50), మధుబాబు(21)ను శుక్రవారం తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా మేళ్ల చెరువు గ్రామానికి చెందిన బోగాల కొండారెడ్డి, కాకునూరి పుష్ప మరికొందరు పామర్రులో కిడ్నాప్ చేశారు. దొరబాబు కొంతకాలం క్రితం కొండారెడ్డి వద్ద ఫైనాన్స్ వ్యాపారం చేశాడు. ఈ క్రమంలో వారి మధ్య కొన్ని విభేదాలున్నాయి. ఇటీవల దొరబాబు స్వగ్రామం పామర్రులోనే ఉంటున్నాడు. ఈ మేరకు వారు కిడ్నాప్ చేశారని దొరబాబు భార్య లోవకాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని హెచ్సీ తెలిపారు.
సినీఫక్కీలో...
దొరబాబు కిడ్నాప్ సంఘటన పామర్రులో కలకలం రేపింది. సినీఫక్కీలో రెండు వాహనాల్లో 15 మందికి పైగా వ్యక్తులు వచ్చారు. కత్తులతో ఇంటిలోని వారిపై దాడి చేశారు. ఇదేమిటని అడిగిన వారిని చంపుతామని బెదిరించి కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లిపోయారు.