ఈ నెల 23న హుకుంపేటలో జాబ్మేళా
ABN , First Publish Date - 2020-12-20T06:54:22+05:30 IST
ఈ నెల 23న రాజమహేంద్రవరం హుకుంపేట మహిళా మండలి సమాఖ్యలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని డీఆర్డీఏ పీడీ వై.హరిహరనాథ్ తెలిపారు.

కాకినాడ,డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : ఈ నెల 23న రాజమహేంద్రవరం హుకుంపేట మహిళా మండలి సమాఖ్యలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని డీఆర్డీఏ పీడీ వై.హరిహరనాథ్ తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, ఎం, బీ, డీ ఫార్మసీ, బీఎస్సీ, బీఏ, బీకాం ఉత్తీర్ణులై 18 నుంచి 30 ఏళ్లలోపు వారు మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఇతర వివరాలకు 9030924569, 8919868419 నంబర్లలో సంప్రదించాలన్నారు.