సార్వా కోతలు 60శాతం పూర్తి: జేసీ లక్ష్మీశ
ABN , First Publish Date - 2020-12-02T05:22:48+05:30 IST
సార్వా కోతలు 60శాతం పూర్తి: జేసీ లక్ష్మీశ

మండపేట, డిసెంబరు 1: జిల్లాలో సార్వా వరి కోతలు 60శాతం మేర పూర్తయ్యాయని జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. వచ్చే ఏడాది మార్చినాటికల్లా దాళ్వా పంట చేతికందేలా రైతులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. మార్చి నెలాఖరుకు పంటకాల్వలు మూసివేసే దృష్ట్యా ఆ మేరకు పనులకు సమాయత్తం కావాలన్నారు. కోనసీమలో కొంతమేర వరి కోతలు పూర్తికావాల్సి ఉందన్నారు. జిల్ల్లాలో రేషన్ బియ్యం రీసైక్లింగ్కు తరలిపోతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జేసీ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పీడీఎస్ బియ్యంతో పట్టుబడుతున్న సంఘటనలు జిల్లాలో అధికంగాఉన్న నేపథ్యంలో జేసీ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు రీసైక్లింగ్ చేసే మిల్లర్లపైనా కఠిన చర్యలు తీసుకుంటామని అక్రమార్కులను హెచ్చరించారు.