వామపక్షాల నిరసన దీక్ష
ABN , First Publish Date - 2020-10-01T07:12:54+05:30 IST
రైతుల ప్రయోజనాలు దె బ్బతీసేలా ఉన్న వ్యవసాయ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని ఉప్పాడ సెంటర్వద్ద
పిఠాపురం, సెప్టెంబరు 30: రైతుల ప్రయోజనాలు దె బ్బతీసేలా ఉన్న వ్యవసాయ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని ఉప్పాడ సెంటర్వద్ద బుధవారం వామపక్షాల నాయకులు నిరసన దీక్ష చేపట్టా రు.
దీక్షలో సీపీఎం, సీపీఐ నాయకులు కూరాకుల సింహాచలం, గురాల అప్పారెడ్డి, కొజ్జవరపు నాగేశ్వరరావు, కేశవరపు అప్పలరాజు, సాకా రామకృష్ణ, వీరవేణి, సాంబశివమూర్తి, సూర్యనారాయణ, గోపాలకృష్ణ, శ్రీను పాల్గొన్నారు.
పెద్దాపురం: వ్యవసాయ సంస్కరణలకు వ్యతిరేకంగా వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్లు అమర్చడాన్ని నిర సిస్తూ మెయిన్రోడ్డులో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం నిరసన దీక్ష చేపట్టారు.
ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దువ్వా శేషుబాబ్జీ మాట్లాడుతూ నూతన విధానంతో ప్రభుత్వం రైతుల మె డకు ఉరితాడు బిగించిందన్నారు. కరణం ప్రసాదరావు, నీలపాల సూరిబాబు, కంచుమర్తి కాటంరాజు, గడగట్ల సత్తిబాబు, యాసలపు అనంతలక్ష్మి, కృష్ణ పాల్గొన్నారు.