కోనసీమవ్యాప్తంగా లాక్డౌన్ అమలు
ABN , First Publish Date - 2020-07-15T10:38:14+05:30 IST
కరోనా వైరస్ విజృంభిస్తున్న దృష్ట్యా కోనసీమ వ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ అమలు చేస్తున్నారు.
![కోనసీమవ్యాప్తంగా లాక్డౌన్ అమలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అమలాపురం, జూలై 14(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ విజృంభిస్తున్న దృష్ట్యా కోనసీమ వ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ అమలు చేస్తున్నారు. నిబంధనల అమలును మంగళవారం ఆర్డీవో బీహెచ్.భవానీశంకర్, డీఎస్పీ షేక్ మసూమ్ బాషా పర్యవేక్షించారు. 11 గంటలు దాటిన తర్వాత షాపులు అన్నింటినీ మూయించివేసి జనసంచారం లేకుండా చర్యలు చేపట్టారు. మాస్కులు ధరించ కుండా రోడ్లపై తిరిగే వ్యక్తులకు అమలాపురం గడియార స్తంభం సెంటర్లో డీఎస్పీ మసూమ్బాషా ఆధ్వర్యంలో, మిగిలిన స్టేష న్లలో ఆయా స్టేషన్ల ఎస్ఐల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇచ్చారు.