ఏవీ నగరంలో వైభవంగా రథోత్సవం
ABN , First Publish Date - 2020-12-26T05:47:12+05:30 IST
ఏవీ నగరంలో శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరుని రథోత్సవం శుక్రవారం నిర్వహించారు.
తొండంగి, డిసెంబరు 25: ఏవీ నగరంలో శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరుని రథోత్సవం శుక్రవారం నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేశారు. స్వామి,అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథంపై గ్రామోత్సం నిర్వహిం చారు. ఆలయ ధర్మకర్త యనమల నాగేశ్వరావు, పీఆర్వో అరిగెల నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.