గ్రామ సెక్రటరీ వేధిస్తున్నాడని ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-12-29T07:03:46+05:30 IST

ఎటపాక, డిసెంబరు 28: రెండున్నర సెంట్ల ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మించుకుంటే దానిని ఖాళీ చేయాలని గ్రామ సెకట్రరీ ఆయ్యన్న వేధిస్తున్నాడని కాపవరం గ్రామానికి చెందిన చింతా ఏడుకొండలు ఆరోపించాడు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తన ఇంటి పన్ను రశీదుతో

గ్రామ సెక్రటరీ వేధిస్తున్నాడని ఫిర్యాదు

ఎటపాక, డిసెంబరు 28: రెండున్నర సెంట్ల ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మించుకుంటే దానిని ఖాళీ చేయాలని గ్రామ సెకట్రరీ ఆయ్యన్న వేధిస్తున్నాడని కాపవరం గ్రామానికి చెందిన చింతా ఏడుకొండలు ఆరోపించాడు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తన ఇంటి పన్ను రశీదుతో పాటు కరెంటు మీటరుకు దరఖాస్తు చేసుకుంటే సెక్రటరీ రూ.10వేలు లంచం డిమాండ్‌ చేయ గా రూ.2 వేలు ఇచ్చానని తెలిపాడు. దీంతో తన ఇల్లు కొందరు ప్రయివేటు వ్యక్తుల పట్టా భూములో ఉందని, వారితో  పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయిస్తూ సెక్రటరీ వేధింపులకు గురిచేస్తున్నాడని ఏడుకొండలు చెప్పాడు. ఈ విషయమై గొమ్ముకొత్తగూడెం సెక్రటరీ అయ్యన్నను వివరణ కోరగా... ఏడుకొండలు ఇల్లు నిర్మించుకున్న భూమి తమదని కొందరు రైతులు ఇటీవల సర్వసభ్య సమావేశంలో ఫిర్యాదు చేశారన్నారు. ఆర్‌అండ్‌బీ రహదారి పక్కన ఇల్లు నిర్మించుకున్న అతడికి నోటీసు కూడా ఇచ్చామని తెలిపారు.

Updated Date - 2020-12-29T07:03:46+05:30 IST