అన్నదాన ట్రస్టుకు రూ.1,16,002 విరాళం
ABN , First Publish Date - 2020-12-19T07:02:05+05:30 IST
అన్నదాన ట్రస్టుకు రూ.1,16,002 విరాళం
అయినవిల్లి, డిసెంబరు 18: అయినవిల్లి శ్రీసిద్ధివినా యకస్వామి ఆలయ అన్నదాన ట్రస్టుకు పశ్చిమగోదావరి జిల్లా పెనమంట్ర మండలం మార్టేరుకు చెందిన గొలుగూరి శ్రీధర్రెడ్డి రూ.1,16,002 విరాళం అందజేశారు. ఆయన కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. దాతకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనంచేసి, శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందించారు. ఆలయ ఈవో దాతను అభినందించారు.