హుండీ ఆదాయం రూ.8.81లక్షలు
ABN , First Publish Date - 2020-12-15T06:35:54+05:30 IST
అమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలోని హుండీలను తెరిచి సోమవారం కానుకలను లెక్కించారు.
అమలాపురం టౌన్, డిసెంబరు 14: అమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలోని హుండీలను తెరిచి సోమవారం కానుకలను లెక్కించారు. 73రోజులకు రూ.8.81లక్షల ఆదాయం వచ్చింది. పాశర్లపూడి గ్రూపు దేవాలయాల ఈవో కె.గంగాధర్ పర్యవేక్షణలో దేవస్థానం చైర్మన్ కర్రి రాఘవుల సమక్షంలో హుండీలను లెక్కించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో బొక్కా వీరవెంకటేశ్వరరావు, ధర్మకర్తలు మామిడిపల్లి వెంకటరత్నం, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.