అడ్వాన్స్ డిప్లమోలో నూతన కోర్సు
ABN , First Publish Date - 2020-11-03T05:34:45+05:30 IST
గైట్ అటానమస్ కళాశాల లో ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి డిప్లమో(అనలిస్ట్ ఐటీ సెక్యూరిటీ ఆపరేషన్స్ కోర్సును నూతనంగా ప్రారంభిస్తున్నట్లు గైట్ క్వాలిటీ ఎస్యూరెన్స్ డైరెక్టర్ టి.వి.ప్రసాద్, ప్రిన్సిపాల్ పీఎంఎంఎస్ శర్మ తెలిపారు.
రాజానగరం, నవంబరు 2: గైట్ అటానమస్ కళాశాల లో ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి డిప్లమో(అనలిస్ట్ ఐటీ సెక్యూరిటీ ఆపరేషన్స్ కోర్సును నూతనంగా ప్రారంభిస్తున్నట్లు గైట్ క్వాలిటీ ఎస్యూరెన్స్ డైరెక్టర్ టి.వి.ప్రసాద్, ప్రిన్సిపాల్ పీఎంఎంఎస్ శర్మ తెలిపారు. సోమవారం వా రు మాట్లాడుతూ రెండేళ్ల అడ్వాన్స్ డిప్లమో కోర్సులో చే రేందుకు సీబీఎస్ఈ ప్యాట్రన్లో 10+2 ఉత్తీర్ణులైన వారు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. 17ఏళ్లు కనీస వయస్సు ఉన్న వారు కోర్సులో ప్రవేశం పొందేందుకు ఈనెల 30 వరకు మాత్రమే గడువు ఉందన్నారు.