కౌలు రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-02T05:27:50+05:30 IST

కపిలేశ్వరపురం మండలంలోని కోరుమిల్లికి చెందిన కౌలు రైతు సుంకర చంద్రయ్య(43) పురుగుల మందు తాగి మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కౌలు రైతు ఆత్మహత్య

కపిలేశ్వరపురం, డిసెంబరు 1 : కపిలేశ్వరపురం మండలంలోని కోరుమిల్లికి చెందిన కౌలు రైతు సుంకర చంద్రయ్య(43) పురుగుల మందు తాగి మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్‌ఐ పి.కిశోర్‌కుమార్‌ కఽథనం ప్రకారం... చంద్రయ్య గ్రామంలో 5 ఎకరాల పొలం కౌలుకు చేస్తున్నాడు. ఇటీవల వరుస తుఫాన్లతో పంట దెబ్బతినడంతో పెట్టుబడి కూడా రాదన్న భయంతో పురుగుల మందు తాగినట్లు చంద్రయ్య భార్య నాగమణి ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై కేసు నమోదు చేసి శవపంచనామా అనంతరం మృతదేహాన్ని రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.  

Updated Date - 2020-12-02T05:27:50+05:30 IST