రైతులను ఆదుకోవడంలోప్రభుత్వం విఫలం
ABN , First Publish Date - 2020-11-29T05:58:24+05:30 IST
తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ ఘోరంగా విఫలమైందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు.
- పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప
పెద్దాపురం, నవంబరు 28: తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ ఘోరంగా విఫలమైందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. జె.తిమ్మాపురంలో నేలకొరిగి నీటమునిగిన వరి పంటను ఆయన శనివారం పరిశీలించారు. రైతులను వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతు పక్షపాతి అని చెప్పుకోవడం తప్ప రైతులకు ఒరగబెట్టింది ఏమీలేదన్నారు. రైతులకు ఆర్థిక భరోసాను కల్పించి వారిని అన్నివిధాలా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అన్నవరం ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, గుడా మాజీ డైరెక్టర్ ఎలిశెట్టి నాని, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు పాల్గొన్నారు.