ఏపీ ఎంసెట్ ధృవపత్రాల పరిశీలన ప్రారంభం
ABN , First Publish Date - 2020-10-24T06:20:58+05:30 IST
ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీఎంసెట్ వెబ్కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా కాకినాడ జేఎన్టీయూకేలోని యూసీఈకే, ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాలల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

- తొలిరోజు 420మంది హాజరు
జేఎన్టీయూకే, అక్టోబరు 23: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీఎంసెట్ వెబ్కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా కాకినాడ జేఎన్టీయూకేలోని యూసీఈకే, ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాలల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1 నుంచి 20,000 ర్యాంకు వరకు గల విద్యార్థుల ధ్రువపత్రాలను ఆన్లైన్లో ఫీజు చెల్లించాకా పరిశీలించారు. మొ దటిరోజు కొంతమంది విద్యార్థులు తాము ఎలా చేయాలో అర్థంకాక సహాయ కేంద్రాలకు ఎక్కువ సంఖ్యలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. జేఎన్టీయూకేలో 1 నుంచి 10,000 ర్యాంకు వరకుగల అభ్యర్థుల ధ్రువపత్రాలను 264మంది... ఏపీటీ సహాయకేంద్రంలో 10,001నుంచి 20,000 ర్యాంకు పరిశీలించగా 156మంది.. మొత్తం రెండు కేంద్రాల్లో 420మంది అభ్యర్థులు హాజరైనట్టు సమన్వయకర్తలు తెలిపారు. ఈనెల 27 వరకు ఈ పరిశీలన కొనసాగనుంది. శనివారం జేఎన్టీయూకేలో ఉదయం 9గంటల నుంచి 20,001 నుంచి 27,500 వరకు, మధ్యాహ్నం ఒంటిగం ట నుంచి 27,501 నుంచి 35,000వరకు.. ఏపీటీలో ఉదయం 35,001 నుంచి 42,500 వరకు, మ ధ్యాహ్నం 42,501 నుంచి 50,000 వరకు ధ్రువపత్రాలను ఆన్లైన్లో పరిశీలించనున్నారు.