‘అర్హులైనవారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి’

ABN , First Publish Date - 2020-10-08T06:35:11+05:30 IST

18 సంవత్సరాలు నిండిన వారందరు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి తహశీల్దార్లు జి.వరహాలయ్య, అమ్మాజీ, శివకుమార్‌ కోరారు...

‘అర్హులైనవారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి’

పిఠాపురం, అక్టోబరు 7: ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరుగుతున్నందున 18 సంవత్సరాలు నిండిన వారందరు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి తహశీల్దార్లు జి.వరహాలయ్య, అమ్మాజీ, శివకుమార్‌ కోరారు. పిఠాపురం తహశీల్దార్‌ కార్యాలయంలో బుధవారం రాజకీయపార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఓటరు నమోదుకు ఈనెల 15 వరకూ గడువు ఉందని అధికారులు తెలిపారు. 10 పోలిం గ్‌ కేంద్రాల పేర్లు మారుస్తున్నామన్నారు. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదుకు నవంబరు 6వ వరకూ గడువు ఉందని వారు తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్లు సత్యనారాయణ, సాయిబాబు, ఎంపీడీవో డీఎల్‌ఎస్‌ శర్మ, ఆయా పార్టీల నాయకులు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, పాల్గొన్నారు.

డిసెంబరు 1న ముసాయిదా జాబితా 

ప్రత్తిపాడు, అక్టోబరు 7: ముసాయిదా ఓటర్ల జాబితా డిసెంబరు 1న ప్రచురిస్తారని తహశీల్దార్‌ పీవివి గోపాలకృష్ణ తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా రూపకల్పనపై బుధవారం తహశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన  అవగాహన సదస్సులో ఆ యన మాట్లాడుతూ డిసెంబరు 31వ వరకు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, క్లైము లు స్వీకరించి విచారణ జరిపి 2021 జనవరి 18న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారని తెలిపారు. ఆయా పార్టీల నాయకులు బెహర దొరబాబు, రామిశెట్టి చినబాబు (వైసీపీ), తోటకూర బాబ్జి (టీడీపీ), ధరణాలకోట శ్రీను (కాంగ్రెస్‌), సింగిల్‌దేవి సత్తిరాజు, పత్రి రమణ (బీజేపీ), వీరబాబు (ముందడుగు), మానుకొండ లచ్చబాబు (లిబరేషన్‌) పాల్గొన్నారు.

Updated Date - 2020-10-08T06:35:11+05:30 IST