కాకినాడ: పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట
ABN , First Publish Date - 2020-12-30T17:07:54+05:30 IST
తమకు రక్షణ కల్పించాలని ఓ ప్రేమ జంట ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది.

కాకినాడ: తమకు రక్షణ కల్పించాలని ఓ ప్రేమ జంట ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. సంగాడి వీరబాబు, పెమ్మాడి శ్రావణి అనే ప్రేమ జంట తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఎస్పీ నయిమ్ హష్మీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. తాళ్ళరేవు మండలానికి చెందిన వీరు అన్నవరంలో వివాహం చేసుకున్నారు. అయితే శ్రావణి తన కుటుంబ సభ్యులు తనను, తన భర్తను చంపేస్తామని బెదిరిస్తున్నారని..తన అత్త మామల ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదు చేసింది.