బీజేపీ మండలాధ్యక్షుడిగా డీవీఎస్
ABN , First Publish Date - 2020-10-07T10:17:31+05:30 IST
బీజేపీ మండలాధ్యక్షుడిగా డీవీఎ్స.రమణారెడ్డి ఎంపికయ్యారు...
చింతూరు, అక్టోబరు 6: బీజేపీ మండలాధ్యక్షుడిగా డీవీఎ్స.రమణారెడ్డి ఎంపికయ్యారు. మంగళవారం 23 మందితో పార్టీ కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షుడిగా రమణారెడ్డితోపాటు, కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. మహిళామోర్చా అధ్యక్షురాలిగా జారె బొజ్జమ్మ, యువజన మోర్చా మండలాధ్యక్షుడిగా సోడి రవి తదితరుల ఎంపికకు జిల్లా అధిష్టానం కమిటీకి అంగీకారం ఇచ్చినట్టు రంపచోడవరం నియోజకవర్గ గిరిజన మోర్చా అధ్యక్షుడు పాయం వెంకయ్య తెలిపారు. కార్యక్రమంలో కారందారయ్య, నోముల రామారావు పాల్గొన్నారు.