ఆలయ నిర్మాణానికి రూ.5లక్షలు విరాళం
ABN , First Publish Date - 2020-11-25T06:24:44+05:30 IST
ఉప్పలగుప్తం మం డలం వానపల్లి పాలెంలో శ్రీకనక దుర్గమ్మ అమ్మవారి ఆలయ నిర్మా ణానికి అమలాపురానికి చెందిన మెట్రోకెమ్ అధినేత డాక్టర్ నందెపు వెంకటేశ్వరరావు, విజయ లక్ష్మి దంపతులు మంగళవారం రూ.5లక్షలు విరాళం అందజేశారు.
అమలాపురం రూరల్, నవంబరు 24: ఉప్పలగుప్తం మం డలం వానపల్లి పాలెంలో శ్రీకనక దుర్గమ్మ అమ్మవారి ఆలయ నిర్మా ణానికి అమలాపురానికి చెందిన మెట్రోకెమ్ అధినేత డాక్టర్ నందెపు వెంకటేశ్వరరావు, విజయ లక్ష్మి దంపతులు మంగళవారం రూ.5లక్షలు విరాళం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నల్లా వెంకటేశ్వరరావు, నల్లా నాగబాబు, నల్లా తాతాజీ, దున్నాల ఆదిబాబు పాల్గొన్నారు.