డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసుల తీరుపై నిరసన
ABN , First Publish Date - 2020-05-19T06:52:53+05:30 IST
నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు దళితజాతికి చెందిన డాక్టర్ సుధాకర్ను విశాఖపట్నం పోలీసులు నడిరోడ్డుపై తాళ్లతో
ప్రత్తిపాడు, మే 18: నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు దళితజాతికి చెందిన డాక్టర్ సుధాకర్ను విశాఖపట్నం పోలీసులు నడిరోడ్డుపై తాళ్లతో కట్టి అమానుషంగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ సోమవారం ప్రత్తిపాడులో టీడీపీ, నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వరుపుల రాజా ఆధ్వర్యంలో నాలుగు మండలాల ఎస్సీ నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో 12 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. వరుపుల రాజా మాట్లాడుతూ వెంటనే డాక్టర్పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలని, డాక్టర్పై దౌర్జన్యం చేసినవారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.