ప్రభుత్వాసుపత్రికి వాకీ-టాకీల అందజేత
ABN , First Publish Date - 2020-08-15T11:21:31+05:30 IST
రాజమహేంద్రవరం ప్రభుత్వాసుప త్రికి భవానీ చారిటబుల్ ట్రస్ట్, గంగరాజు పాల డైరీ ఆధ్వర్యంలో 20 వాకీటాకీలను అందజేశారు. శుక్రవారం ట్రస్ట్
రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 14: రాజమహేంద్రవరం ప్రభుత్వాసుప త్రికి భవానీ చారిటబుల్ ట్రస్ట్, గంగరాజు పాల డైరీ ఆధ్వర్యంలో 20 వాకీటాకీలను అందజేశారు. శుక్రవారం ట్రస్ట్ నిర్వాహకుడు ఆదిరెడ్డి వాసు, పాలడైరీ అధినేత నిమ్మలపూడి గోవిందులు పది సెట్ల వాకీటాకీలను డీసీ హెచ్ఎస్ డాక్టర్ రమేష్కిషోర్కు అందజేశారు.
ఇవి కిలోమీటర్ వరకు పనిచే స్తాయని, ఆసుపత్రిలో ముఖ్యమైన విభాగాల సిబ్బందికి, వైద్యులకు సమాచా రాన్ని చేరవేసేందుకు వీలుగా ఉంటాయని ఆదిరెడ్డి వాసు తెలిపారు. కార్యక్ర మంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాశీ నవీన్కుమార్, పితాని కుటుంబ రావు, గంగాధర్, రూపేష్, మద్దుకూరి హేమంత్, గణేష్ పాల్గొన్నారు.