ఢిల్లీ హైకోర్టు జడ్జి పూజలు

ABN , First Publish Date - 2020-12-30T06:10:42+05:30 IST

అయినవిల్లి శ్రీసిద్ధివినాయకస్వామిని ఢిల్లీ హైకోర్టు జడ్జి వి.కామేశ్వరరావు మంగళవారం దర్శించుకున్నారు.

ఢిల్లీ హైకోర్టు జడ్జి పూజలు

అయినవిల్లి, డిసెంబరు 29: అయినవిల్లి శ్రీసిద్ధివినాయకస్వామిని ఢిల్లీ హైకోర్టు జడ్జి వి.కామేశ్వరరావు మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత అధికారులు, అర్చకులు  ఆలయ మర్యాదలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. నూతన సంవత్సర క్యాలెండర్‌, స్వామివారి చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు. 


Updated Date - 2020-12-30T06:10:42+05:30 IST