కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ వ్యాపార సంస్థలను నడిపితే కఠిన చర్యలు: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-10-24T06:31:15+05:30 IST

కొవిడ్‌ నిబంధలను ఉల్లంఘిస్తూ వ్యాపార సంస్థలను నడిపితే సీజ్‌ చేస్తామని, తప్పులను పునరావృతం చేస్తే లైసెన్స్‌లు కూడా రద్దు చేసేందుకు వెనుకాడబోమని కలెక్టర్‌ డిమురళీధర్‌రెడ్డి స్పష్టం చేశారు.

కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ వ్యాపార సంస్థలను నడిపితే కఠిన చర్యలు: కలెక్టర్‌

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), అక్టోబరు 23: కొవిడ్‌ నిబంధలను ఉల్లంఘిస్తూ వ్యాపార సంస్థలను నడిపితే సీజ్‌ చేస్తామని, తప్పులను పునరావృతం చేస్తే లైసెన్స్‌లు కూడా రద్దు చేసేందుకు వెనుకాడబోమని కలెక్టర్‌ డిమురళీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో జేసీలు జి.లక్ష్మీశ, చేకూరి కీర్తి, జి.రాజకుమారి, డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నో మాస్క్‌, నో ఎంట్రీ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలన్నారు. అత్యధిక కేసులను గుర్తించిన జిల్లాగా తూర్పుగోదావరి నిలిచిందన్నారు. నవంబరు 2న పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బోధన, బోధనేతర సిబ్బందికి కొవిడ్‌ పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 14వేలమంది ఉపాధ్యాయులకుగాను 10వేలమందికి పరీక్షలు పూర్తయ్యాయన్నారు.

Updated Date - 2020-10-24T06:31:15+05:30 IST