24 గంటల్లో 481 కొవిడ్ కేసులు
ABN , First Publish Date - 2020-10-19T07:22:06+05:30 IST
జిల్లాలో గడచిన 24 గంటల్లో కొవిడ్ లక్షణాలున్న వారికి ట్రూనాట్తో చేసిన వైద్య పరీక్షల్లో 241, ర్యాపిడ్ కిట్లతో చేసిన పరీక్షల్లో 240... మొత్తం 481 కేసులు వెలుగుచూశాయి.
కాకినాడ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గడచిన 24 గంటల్లో కొవిడ్ లక్షణాలున్న వారికి ట్రూనాట్తో చేసిన వైద్య పరీక్షల్లో 241, ర్యాపిడ్ కిట్లతో చేసిన పరీక్షల్లో 240... మొత్తం 481 కేసులు వెలుగుచూశాయి. దీంతో బాధితుల సంఖ్య 1,10,092కి చేరింది. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందడంతో కరోనా మరణాలు 586కు చేరుకున్నాయి. యాక్టివ్లో 6,326 మంది నమోదయ్యారు. 1,0,3180 మంది కోలుకున్నారు.