కొవిడ్..371
ABN , First Publish Date - 2020-11-01T07:03:05+05:30 IST
జిల్లాలో తాజాగా 371 మందికి కొవిడ్ వైరస్ సోకింది.
కాకినాడ, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తాజాగా 371 మందికి కొవిడ్ వైరస్ సోకింది. ఇం దులో ట్రూనాట్ ద్వారా 259, రాపిడ్ కిట్లతో చేసిన పరీక్షలో 112 మందికి కొవిడ్ ఉన్నట్టు తేలింది. గడిచిన 24 గంటల్లో కొవిడ్తో వైద్యం పొందుతూ ఒకరు మృతి చెందగా, మరణాల సంఖ్య మొత్తం 611కి చేరింది. పాజిటివ్లు యాక్టివ్ దశలో 4,476 మంది ఉండగా 1,10,657 మంది కోలుకున్నారు.