ధరల పెరుగుదలపై సీఐటీయూ ధర్నా

ABN , First Publish Date - 2020-11-03T06:35:06+05:30 IST

కూరగాయలు, నిత్యావసరాల ధరలను నియం త్రించాలని కోరుతూ తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు.

ధరల పెరుగుదలపై సీఐటీయూ ధర్నా

సామర్లకోట, నవంబరు 2: కూరగాయలు, నిత్యావసరాల ధరలను నియంత్రించాలని కోరుతూ తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ నాయకులు బి.శ్రీనివాస్‌, చిట్టీడి శ్రీనివాసులు మాట్లాడుతూ ఉల్లి ధర కిలో రూ.80 నుంచి రూ.100కు, కూరగాయల ధరలు రూ.80 నుంచి రూ120కి పెరిగాయని, నూనెలు, పప్పుల ధరలు కూడా ఇదే రీతిలో పెరిగాయన్నారు. ప్రభుత్వం నియంత్రించడంలో ధరలను పూర్తిగా విఫలమైందన్నారు. అనంతరం తహశీల్దార్‌ వజ్రపు జితేం ద్రకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బి.సత్తిబాబు, కె.ఏడుకొండలు, రామకృష్ణ, పలివెల అచ్చిబాబు, వేమగిరి సత్యనారాయణ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-03T06:35:06+05:30 IST