చికెన్ తింటే ‘కరోనా’ రాదు
ABN , First Publish Date - 2020-03-13T09:14:47+05:30 IST
చికెన్, మటన్ తినడం వల్ల కరోనా సోకుతుందనే పుకార్లు నమ్మవద్దని పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ ఎన్టీ శ్రీనివాసరావు కోరారు. ఉడకబెట్టిన
అపోహలు నమ్మొద్దు నిర్భయంగా తినొచ్చు
పశుసంవర్ధక శాఖ జేడీ ఎన్టీ శ్రీనివాసరావు
కాకినాడ, మార్చి12(ఆంధ్రజ్యోతి):
చికెన్, మటన్ తినడం వల్ల కరోనా సోకుతుందనే పుకార్లు నమ్మవద్దని పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ ఎన్టీ శ్రీనివాసరావు కోరారు. ఉడకబెట్టిన మాంసం, గుడ్లు తినడం ద్వారా పాలు తాగడం వల్ల ఈ వ్యాధి సోకుతుందనే ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నమ్మవద్దని సూచించారు. మాంసం, గుడ్లు, పాలు ఎప్పటిలాగే తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఏమైనా అనుమానాలుంటే తమ శాఖ హెల్ప్లైన్ నెంబర్ 085 0000 1962లో సంప్రదించవచ్చన్నారు.