కొనసాగిన సీఎం జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2020-05-27T11:21:19+05:30 IST
వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మన పాలన - మీ సూచన పేరిట అమరావతి
కాకినాడ, మే 26 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మన పాలన - మీ సూచన పేరిట అమరావతి నుంచి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ను కొనసాగిస్తున్నారు. రెండో రోజు మంగళవారం వ్యవసాయం, అనుబంధ రంగాలపై సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి ఉప ముఖ్యమంత్రి బోస్, కలెక్టర్, జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామానికి చెందిన ఆక్వా రైతు గంగాధర్ సీఎంతో మాట్లాడారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీసీలో మంత్రులు మోపిదేవి వెంకటరమణ, కురసాల కన్నబాబు పాల్గొన్నారు.