పరిహారం చెల్లించాకే ప్రాజెక్టు నిర్మాణం

ABN , First Publish Date - 2020-10-01T07:41:39+05:30 IST

నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించిన తర్వాతే పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని సీపీ ఎం, సీసీఐ

పరిహారం చెల్లించాకే ప్రాజెక్టు నిర్మాణం

చింతూరు, సెప్టెంబరు 30: నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించిన తర్వాతే పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని సీపీ ఎం, సీసీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం వారు ఎటపాక ఆర్డీవో ఎ.వెంకటరమణను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. 2021 నాటికల్లా ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్తున్న ప్రభుత్వం నిర్వాసితుల విషయంలో చులకన భావంతో వ్యవహరిస్తోందన్నారు.


వరదల కారణంగా విలీన మండలాల్లో ప్రజలు నానా అవస్థలు పడినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా తమ ప్రాంతం పూర్తిగా మునిగిపోతున్నందున 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికీ ఆర్థిక సహకా రం, చేతివృత్తుల వారికి కూడా అదనపు సహకారం అందించా లని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పూసం రాఘవయ్య, కందుకూరి మంగరాజు, గంజి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


Updated Date - 2020-10-01T07:41:39+05:30 IST