వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ధర్నా
ABN , First Publish Date - 2020-10-03T06:47:03+05:30 IST
కేంద్రం ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు ను వ్యతిరేకిస్తూ శుక్రవారం రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ జిల్లా
![వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ధర్నా](https://media.andhrajyothy.com/appimg/galleries/20201863/10032020011657n40.jpg)
రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 2: కేంద్రం ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు ను వ్యతిరేకిస్తూ శుక్రవారం రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు ఎన్వీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు నిరసన ధర్నా చేపట్టారు. ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో గోలి రవి, పిశపాటి రవింద్ర శ్రీనివాస్, లోడా అప్పారావు, పిల్లా సుబ్బారెడ్డి, మట్టా శివకుమార్ పాల్గొన్నారు.