విడుదలైన ఖైదీలకు పునరావాసం కల్పించాలి

ABN , First Publish Date - 2020-11-22T05:26:38+05:30 IST

జిల్లాలో విడుదలైన ఖైదీలకు పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

విడుదలైన ఖైదీలకు పునరావాసం కల్పించాలి

 కలెక్టర్‌  మురళీధర్‌రెడ్డి 

 డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), నవంబరు 21: జిల్లాలో విడుదలైన ఖైదీలకు పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి శనివారం జిల్లా స్థాయి ప్రొబేషన్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశాన్ని జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రొబేషన్‌ అధికారి వద్ద పరిశీలనలో ఉన్న 61 కేసులలో 41 మంది సత్ప్రవర్తన కలిగిన మాజీ ఖైదీలు, 20 మంది పీవో యాక్ట్‌ కింద పర్యవేక్షితులుగాను ఉన్నారన్నారు. వారికి పునరావాసం కల్పించడంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కార్పొరేషన్ల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్ల ద్వారా వారి ప్రవర్తనను పరిశీలిస్తూ వారికి కల్పిస్తున్న పునరావాసాలపై మూడు వారాల్లోగా నివేదికలు సమర్పించడంతో పాటు తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. జిల్లా రెవెన్యూ అఽధికారి సీహెచ్‌ సత్తిబాబు, జిల్లా ప్రొబేషన్‌ అధికారి ఎం.శరత్‌, ఎస్సీ, బీసీ, కార్పొరేషన్‌ ఈడీలు జీఎస్‌ సునీత, ఎస్‌వీఎస్‌ సుబ్బలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ హరిహరనాథ్‌, డీఈవో ఎస్‌.అబ్రహాం, ఎల్‌డీఎం షణ్ముఖరావు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-22T05:26:38+05:30 IST