కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రత్యేక కమిటీ

ABN , First Publish Date - 2020-10-31T06:11:03+05:30 IST

కొత్త జిల్లాల ఏర్పాటుపై జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి చెప్పారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, గ్రామ, వార్డు సచివాలయ నియామకాలపై కలెక్టరేట్‌ నుంచి జిల్లా, డివిజనల్‌ స్థాయి అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ మాట్లాడారు,

కొత్త జిల్లాల ఏర్పాటుపై  ప్రత్యేక కమిటీ

 డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), అక్టోబరు 30: కొత్త జిల్లాల ఏర్పాటుపై జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి చెప్పారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, గ్రామ, వార్డు సచివాలయ నియామకాలపై  కలెక్టరేట్‌ నుంచి జిల్లా, డివిజనల్‌ స్థాయి అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ మాట్లాడారు, డివిజనల్‌ స్థాయిలో అందుబాటులో ఉన్న భౌతిక, మౌలిక వసతుల వివరాలతో నివేదికలు రూపొందించాలని సూచించారు. కొత్త జిల్లాలకు అవసరమైన తాత్కాలిక, శాశ్వత ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, ఖాళీ స్థలాలు తదితర విషయాలపై కసరత్తు చేయాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నవంబరు 10లోగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నవంబరు 2న పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ, జాయింట్‌ కలెక్టర్లు జి.లక్ష్మీశ, చేకూరి కీర్తి, జి.రాజకుమారి, డీఆర్‌వో సీహెచ్‌ సత్తిబాబు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T06:11:03+05:30 IST